రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం

Telugu Lo Computer
0


కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో కమలాపురలో వేగంగా వచ్చిన ఓ ప్రయివేటు బస్సు, జీపును ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మంటల్లో చిక్కి మృతి చెందగా, మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రయివేటు బస్సు గోవా నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. బస్సులో డ్రైవర్​తో పాటు మరో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. 16 మందిని రక్షించి హాస్పిటల్‌కు తరలించారు. మంటలకు బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 8 మంది సజీవదహనం అయ్యారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులను జీవన్(4), దీక్షిత్ (9), రవళి(30), సరళాదేవి (32), అర్జున్ (37), శివకుమార్(35), అనితరాజు(40)గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సును ఆరెంజ్​ కంపెనీకి చెందినదిగా గుర్తించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)