వెయ్యి దాటిన మృతుల సంఖ్య

Telugu Lo Computer
0


ఆప్ఘానిస్థాన్‌లో సంభవించిన భూకంపంలో సుమారు 1,000 మందికి పైగా మరణించినట్లు ఆ దేశ అధికాయ యంత్రాంగం ప్రకటించింది. బుధవారం వచ్చిన ఈ భూకంపంలో 1,500 మందికి పైగా గాయపడ్డట్లు వారు పేర్కొన్నారు. భూకంప తీవ్రత ఇంకా కొనసాగవచ్చని, ప్రజలంతా సురక్షిత ప్రదేశంలో తలదాచుకోవాలని ఆఫ్ఘాన్‌లకు తాలిబన్ ప్రభుత్వం హెచ్చరికలు పంపింది. పాకిస్తాన్‌ సరిహద్దుకు సమీపంలోని ఆగ్నేయ ఆఫ్ఘానిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఖోస్ట్ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో 51 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని యూఎస్‌ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో నమోదైందని అమెరికా పేర్కొంది. గత శుక్రవారం ఇస్లామాబాద్, పెషావర్, రావల్పిండి, ముల్తాన్‌తో సహా పలు పాకిస్థాన్ నగరాలను రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రతతో భూకంపం కుదిపేసింది. ఫైసలాబాద్, అబోటాబాద్, స్వాత్, బునేర్, కోహట్, మలాకంద్‌లలో కూడా భూ ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపంతో రెండు దేశాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు.

Post a Comment

0Comments

Post a Comment (0)