పెళ్లి కుమారుడు జరిపిన కాల్పుల్లో స్నేహితుడు మృతి

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ సోన్‌భంద్రా జిల్లాలోని బ్రహ్మనగర్ ఏరియాలో అంగరంగ వైభవంగా జరుగుతున్న బరాత్ వేడుకలో భాగంగా ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లి కుమారుడు గాల్లోకి కాల్పులు జరిపాడు. ప్రమాదవశాత్తు ఆ బుల్లెట్ స్నేహితుడికి తగిలింది. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. మనీష్ మాద్హేశియా అనే పెళ్లి కుమారుడు తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి బరాత్ వేడుకలో భాగంగా ఊరేగింపుగా వెళ్తున్నాడు. ఈ సమయంలో మనీష్ గాల్లోకి కాల్పులు జరిపాడు. ఆ బుల్లెట్ పెళ్లి కుమారుడు స్నేహితుడు బాబు లాల్ యాదవ్‌కు తగిలింది. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ యాదవ్ ప్రాణాలు కోల్పోయాడు. వరుడు ఉపయోగించిన తుపాకీ కూడా యాదవ్‌దే.

Post a Comment

0Comments

Post a Comment (0)