నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో కరోనా కలకలం

Telugu Lo Computer
0


మహారాష్ట్రంలోని నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో కరోనా కలకలం సృష్టిస్తున్నది. జైలులో ఇప్పటి వరకు తొమ్మిదిమంది ఖైదీలు వైరస్‌ బారినపడ్డారు. నాలుగు రోజుల క్రితం 12 మంది ఖైదీల్లో కరోనా లక్షణాలు కనిపించాయని, వారికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌ వచ్చిందని అధికారులు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి మరో ఐదుగురికి కరోనా నిర్ధారణ అయిందని చెప్పారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య తొమ్మిదికి చేరిందని వెల్లడించారు. పాజిటివ్‌లుగా నిర్ధారణ అయినవారిని ఐసోలేషన్‌కు తలించామని చెప్పారు. వారికి స్వల్ప లక్షణాలు ఉన్నాయని వెల్లడించారు. వారిని ఎవరెవరు కలిశారో గుర్తిస్తున్నామని జైలు అధికారులు తెలిపారు. కాగా, మహారాష్ట్రలో నిన్న 4205 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)