ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో 18 ఏళ్ల జమ్మూకశ్మీర్ యువకుడు ఆదిల్ అల్తాఫ్ అదరగొట్టాడు. సైక్లింగ్ విభాగంలో మొదటి గోల్డ్ మెడల్ ను సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 70 కిమీ సైక్లింగ్ రోడ్ రేసులో ఆదిల్ అందరి కంటే ముందుగా టార్గెట్ ను రీచ్ అయ్యి బంగారు పతకాన్ని అందుకున్నాడు. అంతకముందు ఒక్కరోజు ముందు 28కిమీ విభాగంలో నిర్వహించిన రేసులో రజతం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒక టైలర్ కొడుకు తమ రాష్ట్రానికి గోల్డ్ మెడల్ తీసుకురావడంతో జమ్మూకశ్మీర్ లెప్టిnనెంట్ గవర్నర్ మనోజ్ సింహా ఆదిల్ అల్తాఫ్ను ప్రత్యేకంగా అభినందించాడు. ఇక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో పతకం సాధించాలనే కాంక్షతో ఆదిల్ అల్తాఫ్ గత ఆరు నెలలుగా పాటియాలాలోని ఎన్ఐఎస్లో శిక్షణ తీసుకున్నాడు.
సైక్లింగ్లో ఆదిల్కు గోల్డ్ మెడల్
June 13, 2022
0