జమ్మూ కాశ్మీర్లో ఈరోజు మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.2 తీవ్రతతో భూమి కంపించింది. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్, తజికిస్థాన్ సరిహద్దుల్లో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూమికి 202 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గురించినట్లు పేర్కొంది. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనం ఆందోళనకు గురై ఇండ్ల నుంచి పరుగులు పెట్టారు. ఇప్పటి వరకు ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదని అధికారులు పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ టెక్టోనిక్ ప్లేట్పై ఉంటుందని, తీవ్ర ఒత్తిడి ఉన్న సమయంలో భూకంపాలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
జమ్మూ కాశ్మీర్లో భూకంపం
June 14, 2022
0
Tags