పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) లేకుండానే పీహెచ్డీ చేసే అవకాశం విద్యార్థులకు దక్కనుంది. ఈ మేరకు నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో 7.5/10 సీజీపీఏతో ఉత్తీర్ణులైనవారు పీహెచ్డీకి అర్హులయ్యేలా యూజీసీ నిబంధనలు రూపొందించింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 0.5 మేర సీజీపీఏ తక్కువగా ఉన్నా అనుమతిస్తారు. పీహెచ్డీ ప్రవేశాలకు సంబంధించి 'యూజీసీ నిబంధనలు - 2022'ను జూన్ నెలాఖరున ప్రకటించనున్నారు. ఈ విధానం 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరిన వారు పరిశోధనల వైపు మొగ్గుచూపి ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధనపరమైన వాతావరణం నెలకొల్పేందుకు ఈ నిబంధనలు తోడ్పడతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
పీజీ లేకుండానే పీహెచ్డీ!
June 15, 2022
0