కేరళలోని గురువాయుర్ ఆలయానికి చెందిన రెడ్ కలర్ లిమిటెడ్ ఎడిషన్ మహీంద్రా థార్ వాహనానికి రెండవ సారి వేలం నిర్వహించారు. ఆ వేలంలో థార్ వాహనం 43 లక్షలకు అమ్ముడుపోయింది. మల్లాపురంకు చెందిన భక్తుడు ఒకరు దీన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి గత ఏడాది డిసెంబర్లో జరిగిన వేలంలో ఎన్ఆర్ఐ అమల్ మొహమ్మద్ అలీ దీన్ని సొంతం చేసుకున్నారు. ఆ వేలంలో ఈ వాహనాన్ని 15 లక్షలకు అలీ గెలుచుకున్నారు. అప్పుడు అలీ ఒక్కడే వేలంలో పోటీపడ్డారు. కానీ దేవస్థానం బోర్డు ఈ వాహనాన్ని అతనికి అప్పగించేందుకు ఇష్టపడలేదు. ఈ అంశంలో కేరళ హైకోర్టును కూడా ఆశ్రయించారు. కారుకు మళ్లీ వేలం నిర్వహించాలని కోర్టు తేల్చింది. దీంతో సోమవారం మళ్లీ ఆ రెడ్ కలర్ థార్కు వేలం వేశారు. ఈ సారి 15 మంది బిడ్డింగ్లో పాల్గొన్నారు. దుబాయ్కు చెందిన విఘ్నేశ్ విజయ్కుమార్ 43 లక్షలకు థార్ను సొంతం చేసుకున్నారు. తన తల్లిదండ్రుల కోసం థార్ ఎస్యూవీని గెలుచుకున్నట్లు విజయకుమార్ తెలిపారు.
వేలంలో 43 లక్షల అమ్ముడుపోయిన మహీంద్రా థార్
June 07, 2022
0
Tags