దేశంలో కొత్తగా 17,073 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గత 24 గంటల్లో 17,073 కరోనా కేసులు నమోదయ్యాయి. 21 మంది మరణించారు. ప్రస్తుతం  94,420  కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. పాజిటివిటీ రేటు 4.39 శాతం ఉండగా, రికవరీ రేటు 98.57 శాతం ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,34,07,046 కి పెరిగింది. కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,25,020 కి చేరింది. నిన్న కరోనా నుంచి 15,208 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,27,87,606కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 197,11 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. నిన్న 2,49,646 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా నిన్న 3,03,604 మందికి కరోనా పరీక్షలు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)