దేశంలో కొత్తగా 12,899 కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశంలో  4,46,387 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా 12,899 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,32,96,692 కి చేరింది. నిన్నకరోనాతో 15 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,24,855 కి చేరింది. నిన్న 8,518 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,26,99,363కి చేరింది. ప్రస్తుతం దేశంలో 72,474 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.62 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 2.89 శాతంగా ఉంది. దేశం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. నిన్న 13,24,591 మందికి వ్యాక్సిన్లు పంపిణీ చేయగా.. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,96,14,88,807 డోసులను పంపిణీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)