దేశంలో కొబ్బరి, జనపనార వ్యాపారం రాబోయే ఐదేళ్లలో సంవత్సరానికి రూ.లక్ష కోట్లకు పెరుగుతుందని కేంద్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే పేర్కొన్నారు. దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా కోయంబత్తూర్లో గురువారం నేషనల్ కయర్ బోర్డు చైర్మన్ కుప్పురామన్ అధ్యక్షతన మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి టీఎం అన్బరసన్, కేంద్ర సహాయ మంత్రి భానుప్రతా్పసింగ్ వర్మ, కోవై బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.
లక్ష కోట్లకు పెరగనున్న కొబ్బరి, జనపనార వ్యాపారం
May 07, 2022
0