మటన్‌బిర్యానీ లేదని పెళ్లి వాయిదా !

Telugu Lo Computer
0


సేలం ఆర్‌ఆర్ బిర్యానీ సెంటర్ నిర్వాహకులు తమిళనాడు లోని ఒరతనాడులో పెళ్లికి నాన్ వెజ్ బిర్యానీ కోసం ఆర్డర్ ఇచ్చారు. జొమాటో 3,500 కిలోల మాంసాన్ని సరఫరా చేసింది. బెంగళూరు నుంచి తమిళనాడుకు మటన్, చికెన్‌ని పార్శిల్ చేసింది. అయితే, ఆన్‌లైన్ ఆర్డర్‌లో టన్నుల కొద్దీ కుళ్లిన మాంసం రావడంతో పెళ్లి బృందం ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది. తనిఖీలు నిర్వహించిన అధికారులు అది కుళ్లిన మాంసమేనని తేల్చారు. దీనిపై జొమాటో వివరణ ఇవ్వాలని సేలం ఆర్ఆర్ బిర్యానీనోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉండగా, వచ్చిన బంధువులకు భోజనం పెట్టకుండా పెళ్లి జరిపించలేమని, బిర్యానీ లేకపోవడంతోనే పెళ్లి వాయిదావేసుకున్నామని వధూ వరుల కుటుంబ సభ్యులు తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)