సుప్రీంకోర్టు నూతన జడ్జీల ప్రమాణస్వీకారం

Telugu Lo Computer
0


సుప్రీం కోర్టు అదనపు భవనం కాంప్లెక్స్‌లోని ఆడిటో రియంలో ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ నూతన న్యాయ మూర్తులు గా సుదాన్షు దులియా, జంషెడ్‌ బర్జర్‌ పార్దివాలా చేత ప్రమాణస్వీకారం చేయించారు. న్యాయమూర్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో 33, 34 న్యాయమూర్తులుగా వీరు ప్రమాణస్వీకారం చేశారు దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యలో పూర్తి సామర్థ్యంతో ఉంది. తేనీటి కార్యక్రమం తరువాత నూతన న్యాయమూర్తులు తమ కోర్టు రూముల్లోకి వెళ్లారు. కోర్టు నంబర్‌ 1లోని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనంలో జస్టిస్‌ పార్దివాలా భాగమయ్యారు. జస్టిస్‌ యుయు లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్‌ దులియా బాధ్యతలు స్వీకరించారు. వీరిద్దరితో కలిపి రమణ కొలీజియం ఆగస్టు 2021 నుంచి ఇప్పటి వరకూ మొత్తం 11 మంది జడ్జిలను నియమించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)