ఆధార్ కార్డుల దుర్వినియోగాన్ని నిరోధించడం కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఓ ప్రకటనలో ప్రజలను కోరింది. కేవలం ఆధార్ కార్డుల మాస్క్డ్ కాపీస్ను మాత్రమే షేర్ చేయాలని తెలిపింది. ఆధార్ సంఖ్యలో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించే విధంగా జెరాక్స్ కాపీ తీసి ఇతరులకు ఇవ్వాలని తెలిపింది. 'మీ ఆధార్ జెరాక్స్ కాపీని ఏ సంస్థకూ ఇవ్వకండి, ఎందుకంటే, అది దుర్వినియోగమయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యామ్నాయంగా మీరు మీ ఆధార్ సంఖ్యలో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించేవిధంగా మాస్క్డ్ ఆధార్ను మాత్రమే ఇవ్వండి'' అని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇతరుల ఆధార్ కార్డుల కాపీలను సేకరించి, తమ వద్ద ఉంచుకునేందుకు హోటళ్ళు, సినిమా హాళ్ళు వంటి లైసెన్స్ లేని సంస్థలకు అనుమతి లేదని తెలిపింది. భారత దేశ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ నుంచి యూజర్ లైసెన్స్ పొందిన సంస్థలు మాత్రమే వ్యక్తిని గుర్తించేందుకు ఆధార్ను ఉపయోగించవచ్చునని తెలిపింది. ప్రజలు తమ ఆధార్ కార్డు కాపీని ఇచ్చే ముందు సంబంధిత సంస్థకు ఇటువంటి యూజర్ లైసెన్స్ ఉన్నట్లు ధ్రువీకరించుకోవాలని చెప్పింది. ఆధార్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రజలు పబ్లిక్ కంప్యూటర్లను ఉపయోగించుకోవద్దని తెలిపింది. ఇంటర్నెట్ కేఫ్ల వంటి వాటిలోని కంప్యూటర్ల నుంచి ఆధార్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవద్దని తెలిపింది. ఒకవేళ ఇటువంటి కంప్యూటర్లను ఉపయోగించినట్లయితే, ఆ ఈ-ఆధార్ కాపీలను ఆ కంప్యూటర్ల నుంచి శాశ్వతంగా డిలీట్ చేసినట్లు ధ్రువీకరించుకోవాలని పేర్కొంది. Official UIDAI website నుంచి మాస్క్డ్ ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు 12 అంకెల ఆధార్ కార్డు సంఖ్యను ఈ వెబ్సైట్లో ఎంటర్ చేయాలి. 'Do you want a masked Aadhaar' ఆప్షన్ను ఎంచుకొని మాస్క్డ్ ఆధార్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఆధార్ మాస్క్డ్ కాపీలను మాత్రమే షేర్ చేయండి !
May 29, 2022
0
Tags