మధ్యప్రదేశ్లోని సాగర్లో ప్రజలు కూడబెట్టుకున్న సొమ్మును క్రికెట్ బెట్టింగ్కు వినియోగించాడో పోస్టుమాస్టర్. ఉన్నతాధికారుల ఫిర్యాదుతో నిందితుడు విశాల్ అహిర్వార్ (36)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ల కాల పరిమితి ముగియడంతో వాటిని తీసుకునేందుకు వచ్చిన ప్రజలు అక్కడి సిబ్బంది ఇచ్చిన సమాధానంతో అవాక్కయ్యారు. డిపాజిట్ చేసిన మొత్తాల వివరాలేవీ పోస్టాఫీసులో లేవని సబ్ పోస్టాఫీసులోని సిబ్బంది తెలిపారు. దీంతో డబ్బు ఏమైందో ఆరా తీయగా...స్వల్పకాలంలో ధనాన్ని రెట్టింపు చేసే ఉద్దేశంతో పోస్టుమాస్టరే ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లో పెట్టారని తెలిసింది. డిపాజిటర్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విశాల్ అహిర్వార్ను అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. అధిక లాభం వస్తుందనే ఆశతో ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్ యాప్ ద్వారా ఆ మొత్తాన్ని వెచ్చించినట్లు వెల్లడించాడు.
పొదుపు సొమ్ముతో బెట్టింగ్ కు పాల్పడిన పోస్టు మాస్టర్ !
May 26, 2022
0
Tags