దివాలా అంచున బంగ్లాదేశ్ ?

Telugu Lo Computer
0


శ్రీలంక, పాకిస్థాన్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. తాజాగా  బంగ్లాదేశ్ సైతం ఈ జాబితాలో చేరబోతోంది. కేవలం రానున్న 5 నెలల కాలంలో ఆ దేశం దివాలా తీసే అవకాశం ఉనట్లు తెలుస్తోంది. అక్కడ కూడా విదేశీ మారకద్రవ్య నిల్వలు అడుగంటున్నాయి. ఈ తరుణంలో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం విదేశాల నుంచి ఏసీలు, ఖరీదైన వాహనాలతో పాటు ఇతర ఎలక్ట్రిక్ వస్తువుల దిగుమతులను నిషేధించింది. పరిస్థితులు చేజారిపోకముందే చక్కదిద్దాలను ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రధానంగా ఇంధనం, పెరిగిన ఆహార ధరలు, దిగుమతుల కారణంగా కరెన్సీ నిల్వలు క్షీణిస్తున్నట్లు తెలుస్తోంది. ఖర్చులు పెరిగిన రీతిలో ఎగుమతుల వల్ల వచ్చే ఆదాయం పెరగలేదని అక్కడి మీడియా కథనాలు చెబుతున్నాయి. గత సంవత్సరం కంటే దిగుమతులు ఏకంగా 54 శాతం బంగ్లాదేశ్ లో పెరిగాయి. అంతర్జాతీయంగా డాలర్ విలువ బలపడటం వల్ల ఎగుమతులు పెరిగినప్పటికీ ఆదాయం మాత్రం తగ్గింది. డాలర్ల కొనుగోలుకు ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. దీని కారణంగా వాణిజ్య లోటు కూడా భారీగానే పెరుగుతోంది. డాలర్ తో టాకా మారకపు రేటు ప్రస్తుతం 86.7 వద్ద ఉంది. దిగుమతల సమయంలో కరెన్సీ మార్పిడి చేయటం వల్ల ఒక్కో డాలర్ కు 95 టాకాలు చెల్లించాల్సి వస్తోంది. దీని వల్ల దిగుమతి చేసుకుంటున్న వస్తువులు ఖరీదుగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే విదేశీ మారక నిల్వలను కాపాడుకునేందుకు ఆ దేశం విదేశీ ప్రయాణాలను సైతం నిషేధించినట్లు తెలుస్తోంది. మారక నిల్వలపై సరైన వివరాలు ఇవ్వాలని మరో పక్క ఐఎమ్ఎఫ్ సైతం బంగ్లాదేశ్ పై ఒత్తిడి పెంచుతోంది. ఈ పరిస్థితులు రానున్న కాలంలో ఆ దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందని తెలుస్తోంది. డాలర్లను ఎక్కువగా ఆ దేశం ఇంధన కొనుగోళ్ల కోసం ఖర్చుచేయాల్సి వస్తోంది. ఈ లెక్కన ఇంచుమించుగా అక్కడ కూడా శ్రీలంక పరిస్థితులే ఉన్నట్లు కనిపిస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)