పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చాము...!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా బుదరావలసలో నివాసముంటున్న జగన్నాథ మహంతి అనే వ్యక్తి ఇంటికి ఐదుగురు వెళ్లి తలుపులు తట్టారు. మీ దుకాణానికి వెళ్తే.. మూసివేసి ఉందని, పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చామని పిలవడంతో జగన్నాథ భార్య జ్యోతి తలుపులు తెరిచారు. అంతా లోపలికి వచ్చి, ఎండతో వచ్చాం, తాగేందుకు నీళ్లు ఇవ్వండని అనడంతో ఆమె వంట గది వైపు వెళ్లగా ఆమె వెనకాల వెళ్లిన దుండగులు కత్తితో బెదిరించారు. అదే సమయంలో ఆమె కొడుకు ప్రీతమ్‌(15) తన తల్లిపై దాడి చేయండం గమనించి అవరడంతో అతడిని కొట్టి బాత్‌రూంలో బంధించారు. దీంతో వేరే గదిలో ఉన్న ఆమె కూతురు చాందిని(17) కేకలు వేయగా ఇరుగు-పొరుగు వారు రావడంతో దుండగులు బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న 15 వవార్డు కౌన్సిలర్‌ సంతోష్‌ కుమార్‌ దొళాయి పోలీసులకు సమాచారం అందించారు. సైంటిఫిక్‌ బృందం ఆధారాలు సేకరించిందని ఐఐసీ రస్మీరంజన్‌ ప్రదాన్‌ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)