స్థానికులు పోలీస్ స్టేషన్‌ను తగలబెట్టారు !

Telugu Lo Computer
0


అస్సాంలోని నాగావ్‌లోని బటద్రవ పోలీస్ స్టేషన్‌కు కస్టడీలో ఒక వ్యక్తిని చంపేశారని ఆరోపిస్తూ ఆగ్రహించిన కొంతమంది వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడగా, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ వ్యక్తి రాత్రిపూట మద్యం మత్తులో రోడ్డుపై కనిపించడంతో పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు. లంచం ఇవ్వనందుకే పోలీసులు హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అతడిని కలవడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లగా, అస్వస్థతతో ఉన్నందున అతను ఆసుపత్రిలో చేరాడని చెప్పారని... ఆసుపత్రికి వెళ్లి చూడగా అతడు మరణించి ఉన్నాడని.. అతని మృతదేహాన్ని మార్చురీలో ఉంచారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆ తరువాత, స్థానిక నివాసితులతో కలిసి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఆగ్రహంతో వారు పోలీస్ స్టేషన్‌ను ధ్వంసం చేసి, తగులబెట్టినట్లు అందులో పేర్కొన్నారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)