ట్రక్కును ఢీకొన్న కారు : ఐదుగురి దుర్మరణం

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో వేగంగా వస్తున్న కారు ట్రక్కును ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. శుక్రవారం అర్దరాత్రి నాగ్‌పూర్ జిల్లాలో వేగంగా వస్తున్న మల్టీ యుటిలిటీ కారు వెనుక నుంచి ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురి మరణించగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది.టవేరా వాహనం ఉమ్రేడ్ నుంచి నాగపూర్ వైపు వెళుతుండగా విహిర్ గావ్ సమీపంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని, మృతులను ఇంకా గుర్తించలేదని డీసీపీ నూరుల్ హసన్ చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)