కర్ణాటక రాష్ట్రంలో ఇకపై పోటీ పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల వద్ద జామర్లను అమర్చాలని ప్ర భుత్వం నిర్ణయించింది. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల నియామకాలలో బ్లూటూత్ల ద్వారా అక్రమాలకు పాల్పడినట్లు విచారణ జరుపుతున్న సీఐడీ తేల్చింది. తరచూ ఇటువంటి వివాదాలు తలెత్తుతున్నందున ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, ఇకపై ఉద్యోగాలకు సంబంధించి జరిపే అన్ని పరీక్షా కేంద్రాలలో జామర్లు అమర్చాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుం చే స్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాయి. నియామకపు పరీక్షలలో మొబైల్, బ్లూటూత్, ఇంటర్నెట్ సాయం ద్వారా పలు పరికరాలు వాడారు. జామర్ లు ఏర్పాటు చేస్తే ఎటువంటి అక్రమాలకు తావు ఉండదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
పరీక్షా కేంద్రాల్లో జామర్లు
May 19, 2022
0
Tags