బ్లేడ్‌తో మర్మాంగాన్ని కోసిన యువతి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా తుమ్మలపాలెం గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. హైతా నగర్‌కు చెందిన సంధ్య అనే మహిళతో రామచంద్రారెడ్డి గత కొన్ని నెలల నుంచి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సోమవారం రాత్రి సంధ్య నివాసంలో ఆమెతో కలిసి రామచంద్రారెడ్డి మద్యం సేవించాడు. అనంతరం సంధ్య ఇంటిపైనే అతను నిద్రించాడు. తల్లితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న రామచంద్రారెడ్డి ఆగడాలను సంధ్య చిన్న కూతురు జ్యోతి భరించలేకపోయింది. దీంతో గాఢ నిద్రలో ఉన్న అతనిపై బ్లేడ్‌తో దాడి చేసి మర్మాంగాన్ని కోసేసింది. ఈ క్రమంలో అతను గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు అప్రమత్తమయ్యారు. అతన్ని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రామచంద్రారెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)