ఈశాన్య ఢిల్లీలోని షాకర్పూర్లో శనివారం అర్థ రాత్రి కారు, బైక్ ఢీ కొన్న ఘటనలో జొమాటో డెలివరీ వ్యక్తితోపాటు ఇద్దరు యువతులు మరణించారు. ఇద్దరు యువతులు, వారి కుటుంబానికి చెందిన మరో ఐదుగురు కలిసి పశ్చిమ ఢిల్లీలోని పీరాగర్హి నుంచి కర్కార్డూమాలోని తమ ఇంటికి కారులో తిరిగి వస్తున్నారు. వాహనం ముందు వైపు ముగ్గురు, వెనుక నలుగురు కూర్చున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు లక్ష్మీ నగర్ మీదుగా వెళుతుండగా, బైక్పై వెళ్తున్న జోమాటో డెలివరీ వ్యక్తి అడ్డుగా వచ్చాడు. దీంతో కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బైక్ను ఢీకొట్టి అది బోల్తాపడింది. ఈ ప్రమాదంలో జొమాటో డెలివరీ వ్యక్తితోపాటు బోల్తా పడిన కారులో ఇరుక్కుపోయిన 17 ఏండ్ల జ్యోతి, 19 ఏండ్ల భారతిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు తెలిపారు. కారులోని మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాని పోలీసులు చెప్పారు. చనిపోయిన జొమాటో డెలివరీ వ్యక్తిని గుర్తించలేదన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Post Top Ad
adg
Sunday, 1 May 2022
Home
Criem
ఈశాన్య ఢిల్లీలోని షాకర్పూర్లో
కారు
కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బైక్ను ఢీ
బైక్ ఢీ ఘటనలో ముగ్గురు మృతి
కారు, బైక్ ఢీ ఘటనలో ముగ్గురు మృతి
కారు, బైక్ ఢీ ఘటనలో ముగ్గురు మృతి
Tags
# Criem
# ఈశాన్య ఢిల్లీలోని షాకర్పూర్లో
# కారు
# కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బైక్ను ఢీ
# బైక్ ఢీ ఘటనలో ముగ్గురు మృతి
About Telugu Lo Computer
బైక్ ఢీ ఘటనలో ముగ్గురు మృతి
Tags
Criem,
ఈశాన్య ఢిల్లీలోని షాకర్పూర్లో,
కారు,
కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బైక్ను ఢీ,
బైక్ ఢీ ఘటనలో ముగ్గురు మృతి
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment