రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించిన యువతుల జంట!

Telugu Lo Computer
0


బీహార్​లోని [పాట్నాలో ఇంద్రపురికి చెందిన తనిష్క్​ శ్రీ అనే యువతి సహస్ర ప్రాంతానికి శ్రేయా ఘోష్  ప్రేమించుకున్నారు. ఈ ఇద్దరికి గత ఐదేళ్లుగా పరిచయం ఉండగా.. ఈ మధ్యే అది ప్రేమగా మారి కలిసి జీవించాలనుకున్నారు. ఈ విషయం వారి కుటుంబ సభ్యులు తెలియడంతో తనిష్క్​ను ఆమె కుటుంబ సభ్యులు ఇంట్లో నిర్భందించి, శ్రేయా ఘోష్​పై నకిలీ కిడ్నాప్ కేసును కూడా పెట్టారు. ఇంట్లో నుండి తప్పించుకున్న తనిష్క్, శ్రేయా ఘోష్ తో కలిసి పట్నాలోని మహిళా పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసినా అక్కడి పోలీసులు కేసు నమోదుకు నిరాకరించారట!. దీంతో ఈ మహిళా జంట పాట్నా ఎస్​ఎస్​పీని కలిసి ఫిర్యాదు చేసి తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. స్వలింగ సంపర్కుల లైంగిక చట్టం ప్రకారం తమకు కలిసి ఉండే హక్కు ఉందని.. కుటుంబ సభ్యులతో సహా ఎవరికి తమను విడదీసే హక్కు లేదని వీరు పోరాడుతున్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)