దేశంలో కొత్తగా 2,710 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో 4,65,840 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 2,710 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,47,530 కి చేరింది. 24 గంటల్లో కరోనా కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,24,539కి చేరింది. నిన్న 2,296 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,26,07,177కి చేరింది. ప్రస్తుతం దేశంలో 15,814 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.75 గా, రోజు వారి పాజిటివ్ రేటు 0.58గా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న14.41లక్షల మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 192.97కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)