దేశంలో కొత్తగా 2,568 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో కొత్తగా 2,568 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20మంది కొవిడ్ తో చికిత్స పొందుతూ మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది,యాక్టివ్ కేసుల సంఖ్య 19,137కి చేరుకుంది. ఇప్పటి వరకు 4,30,84,913 కొవిడ్ కేసులు నమోదయ్యాయి, 5,23,889 మరణాలు సంభవించాయి.రికవరీ రేటు 98.74శాతంగా, పాజిటివిటీ రేటు 0.04 శాతంగా నమోదైంది. సోమవారం  2,911 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,25,41,887కి చేరుకుంది. దేశంలో ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ పరీక్షలు 83.86కోట్లు దాటాయి. గడిచిన 24 గంటల్లో 4,19,552 మందికి టెస్టులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 3,365 ల్యాబ్స్ లో కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే కొవిడ్ వ్యాప్తి నివారణ కోసం దేశవ్యాప్తంగా కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది. దేశంలో 473 రోజులుగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 189.41 డోసుల టీకాలు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అందజేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)