బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూ ముస్లింల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసేందుకు, శాంతిభద్రతలకు విఘాతం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంకు సూచించానని మాజీ సీఎం యడియూరప్ప అన్నారు. కర్ణాటక శాంతికి పెట్టింది పేరని, రోజురోజుకు వెర్రి తలకెక్కి చిత్ర విచిత్రమైన ఘటనలు జరుగుతుండడం తనను మానసికంగా బాధ కలిగిస్తోందన్నారు. ధారవాడలో నిరుపేద ముస్లిం వ్యాపారిపై జరిగిన దాడి తనను కలచివేసిందన్నారు. అభివృద్ధిని అడ్డుకునే దిశలో ప్రతిపక్షాలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయని మండిపడ్డారు.
హిందూ, ముస్లింలు ఒకే తల్లి బిడ్డలు
April 12, 2022
0
Tags