పసికందును చితకబాదిన తల్లి!

Telugu Lo Computer
0


జమ్మూ డివిజన్‌లోని సాంబా జిల్లాలో ఓ మహిళ తన శిశువుతో మంచంపై కూర్చున్నది. అయితే ఎవరితోనూ వాదిస్తున్న ఆమె తన ఒడిలో ఉన్న శిశువును హింసించింది. ఏడుస్తున్న పాపను దారుణంగా కొట్టింది. ఈ హృదయ విదారక దృశ్యాలను అక్కడున్న వ్యక్తి చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఈ ఘటనపై పోలీసులు సీరియస్‌గా స్పందించారు. చిన్నారిని చితకబాదిన తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పాపపై దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయం తెలియరాలేదని పోలీసులు స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)