ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల పట్టణంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న శేఖర్ అనే వ్యక్తిని కొందరు గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా కొట్టి చంపారు. గోడౌన్ వద్ద మద్యం తాగొద్దని చెప్పినందుకు హోంగార్డుతో గొడవకు దిగి, కొట్టి చంపినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో హోంగార్డు శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం నిందితుల కోసం గాలిస్తున్నారు.
హోంగార్డును చంపిన గుర్తు తెలియని దుండగులు
April 11, 2022
0