పెరిగిన బంగారం ధరలు !

Telugu Lo Computer
0


కొద్ది రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉండి ఈరోజు ఒక్కసారిగా రూ.500 వరకూ పెరిగాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఉక్రెయిన్ రష్యా వార్ నేపథ్యంలో అంతర్జాతీయంగా కొద్ది వారాలుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎమ్‌సీఎక్స్‌)లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ .52వేల 860 వద్ద ట్రేడవుతోంది. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 18 తగ్గడం విశేషం. సిల్వర్ ఫ్యూచర్స్ ధర ఎమ్‌సీఎక్స్‌లో కిలోకు రూ.147 పెరిగి రూ.68వేల 937 వద్ద ఉంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో దేశీయంగా కూడా ధరలు పెరిగాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రెండు రోజుల్లో రూ.440కి పైగా పెరిగి రూ.53వేల 460కి చేరుకుంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.49వేల 10కి పెరిగింది. హైదరాబాద్ నగరంలోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49వేల 10గా ఉంది. రెండు రోజుల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.53వేల 20 నుంచి రూ.53వేల 460కి చేరుకుంది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు వాటి వడ్డీ రేట్లు, జ్యూయెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వంటి పలు అంశాలు ప్రభావం కారణంగా ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)