ఈ విద్యా సంవత్సరం నుంచే 8వ తరగతిలో ఇంగ్లీష్‌ మీడియం

Telugu Lo Computer
0



తాడేపల్లి లోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో  2022-23 విద్యాసంవత్సరం నుండి 8వ తరగతిలో ఇంగ్లీష్‌ మీడియం  ప్రారంభించాలని సీఏం జగన్‌ ఆదేశించారు.  ఈ సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి మండలానికీ రెండు  జూనియర్‌ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, వాటిల్లో అమ్మాయిలకు ప్రత్యేకించి ఒక కాలేజీ ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఏడాది జగనన్న విద్యాకానుకకు అంతా సిద్ధం చేశామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. స్కూళ్లు తెరిచే నాటికి విద్యార్ధులకు విద్యాకానుక అందించేలా చర్యలు తీసుకోవాలని సీఏం ఆదేశించారు. ఇక ఈ ఏడాది విద్యాకానుకకు దాదాపుగా రూ.960 కోట్లు ఖర్చు అవ్వనుందని, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. పాఠశాలల్లో చదువుతున్న పిల్లలందరూ మన పిల్లలే, వారిని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. నాడు - నేడు రెండో దశ పనులపై ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ రెండో దశ పనుల వేగం పెంచాలన్నారు. రెండోదశ కింద దాదాపు 25 వేల స్కూళ్లలో పనులు ప్రారంభించాలని, ఈ పనుల ద్వారా ఈ ఏడాది స్కూళ్లలో గణనీయమైన మార్పులు కనిపించాలని అధికారులను ఆదేశించారు. దీంతో చరిత్రలో మన ప్రభుత్వం పేరు, భాగస్వాములైన అధికారుల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. నాడు-నేడు రెండోదశ ఖర్చు రూ. 11,267 కోట్లుగా అంచనా వేశారు. విద్యా వ్యవస్థలో మహిళా పోలీసులు నిర్వర్తించాల్సిన విధులపై సీఎం ఆదేశాలమేరకు అధికారులు ఎస్‌ఓపీని రూపొందించినట్లు తెలిపారు. స్కూళ్లు, కాలేజీల్లో భద్రతపై మహిళా పోలీసులు విద్యార్ధులకు అవగాహన కల్పించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)