మైక్రోసాఫ్ట్ ఇండియా కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా ఇరినా ఘోస్ నియమితులయ్యారు. ఇరినాకు దాదాపు 20 ఏళ్ల నుంచి మైక్రో సాఫ్ట్తో అనుబంధం ఉంది. ఇప్పటి వరకు క్లౌడ్ సొల్యూషన్స్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నా ఆమె పలు స్వచ్ఛంచ సేవలు విడువలేదు. ఓ పక్క ఉద్యోగ బాధ్యతలతో పాటు మరో పక్క బాలికలకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో 'మైలిటిల్బిట్' అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. అంతేకాదు మహిళల ఆధ్వర్యంలో నడిచే స్టార్టప్లకు అండగా నిలుస్తున్నారు. 'సోండర్ కనెక్ట్' సంస్థకు ట్రస్టీగా ఉన్న ఇరినా మహిళా సాధికారత కోసం పాటుపడుతున్నారు. ఇరినా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పట్టభద్రురాలు. ఎక్స్ఎల్ఆర్ఐ నుంచి ఎంబీఏ చేశారు. వ్యాపారం, సాంకేతికతలో మహిళల పాత్ర పెరగాలన్నది ఆమె ఆకాంక్ష. మైక్రోసాఫ్ట్ నుంచి 'స్ఫూర్తిదాయక మహిళ' పురస్కారం కూడా అందుకున్నారు. ఇరినా.. మారథాన్ రన్నర్, సంగీత ప్రేమికురాలు కూడా. హెచ్.సి.ఎల్., ఇన్ఫోసిస్టమ్స్, విప్రోలో పనిచేసిన ఇరినా డిసెంబర్ 2001లో మైక్రోసాఫ్ట్ లో చేరారు.
మైక్రోసాఫ్ట్ కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఇరినా ఘోస్
April 13, 2022
0
Tags