ఆరోగ్యంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. అలసట లేకుండా బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి ఒక మంచి పాలను తయారు చేసుకుని వారంలో మూడు సార్లు తాగితే మంచి ప్రయోజనం కలుగుతుంది. 10 జీడిపప్పులు, 4 అంజీరాలు, 4 గింజలు తీసిన ఖర్జూరం,10 కిస్ మిస్ వేసి అరకప్పు పాలు పోసి రెండు గంటలు నానబెట్టాలి. 6 బాదం పప్పులను నీటిలో నానబెట్టి తొక్క తీసి రెడీ చేసి, మిక్సీ జార్ లో తొక్క తీసిన బాదం పప్పు, నానబెట్టిన డ్రై ఫ్రూట్ లు, మూడు యాలకులు వేసి మిక్సీ చేయాలి. ఆ తర్వాత ఒక కప్పు పాలను పోసి బాగా మిక్సీ చేసి గ్లాస్ లో పోసి సర్వ్ చేయటమే. ఈ పాలను వారంలో రెండు సార్లు తాగితే శారీరక బలహీనత, నీరసం తగ్గి ఉషారుగా ఉంటారు. అంతేకాక ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తగ్గటానికి బాగా సహాయపడుతుంది.
Post a Comment
0Comments
3/related/default