మోడీని హతమారుస్తామని బెదిరింపు ఈమెయిల్‌

Telugu Lo Computer
0


ప్రధాని మోడీ హత్యకు కుట్ర చేసినట్టు ముంబై లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి బెదిరింపు ఈమెయిల్‌ వచ్చింది. మోదీని చంపేస్తామని ఈమెయిల్‌లో బెదిరించారు. ప్రధాని మోడీ హత్యకు 20 మందితో స్లీపర్‌సెల్‌ రెడీగా ఉందని ఈమెయిల్‌లో హెచ్చరించారు. మోడీ హత్యకు 20 కేజీల ఆర్‌డీఎక్స్‌ను కూడా సిద్దం చేసినట్టు తెలిపారు. ఈమెయిల్‌పై కేంద్ర హోంశాఖ అత్యున్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశింది. వివిధ ఏజెన్సీలకు ఈమెయిల్‌ వివరాలను పంపించారు. ఎక్కడి నుంచి ఈమెయిల్‌ వచ్చింది ? ఎవరు ఈమెయిల్ పంపించారన్న విషయంపై దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఇది కచ్చితంగా టెర్రరిస్టుల పనేనని అనుమానిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)