దేశంలో కొత్తగా 796 కరోనా కేసులు !

Telugu Lo Computer
0


దేశంలో కరోనా మహమ్మారి అదుపులో ఉంది. గడిచిన 24 గంటల్లో 4,06,251 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, 796 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,36,928కి చేరింది. నిన్న 19 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,21,710కి చేరింది. 946 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,25,04,329కి చేరింది. ప్రస్తుతం దేశంలో 10,889 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.76, రోజువారి పాజిటివ్ రేటు 0.20శాతంగా నమోదు అయింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 185.90కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)