ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె మామ, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. చంద్రశేఖర్ రాజు భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు కురుపాం మండలంలోని చినమేరంగి కోటకు తరలించనున్నారు. చంద్రశేఖర్ రాజు టీడీపీ నేత శత్రుచర్ల విజయరామరాజుకు సోదరుడు. అంతేకాదు ఏపీ మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణికి ఆయన మామ అవుతారు. గతంలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు ఎన్నికయ్యారు. శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు మృతిపట్ల పలు రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు.
మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు మృతి
April 29, 2022
0
Tags