పుల్వామాలో భారీ ఎన్ కౌంటర్

Telugu Lo Computer
0


జమ్ము కశ్మీర్ లోని పుల్వామాలో బుధవారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామాలోని మిత్రిగామ్ ప్రాంతంలో బుధవారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో మరణించిన ఇద్దరు ఉగ్రవాదుల నుంచి ఏకే 47 రైఫిళ్లను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయాన్ని జమ్ము కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్ కౌంటర్ లో హతమైన ఇద్దరు ఉగ్రవాదులు అల్ బద్రే ఉగ్రవాద సంస్థకు చెందిన వారని.. ఎజాజ్ హఫీజ్, షాహిద్ అయూబ్ లు గుర్తించినట్లు ఆయన తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)