ప్రిన్సిపాల్‌తో టీచర్‌ రాసలీలలు !

Telugu Lo Computer
0


ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ మహిళ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. రోజూ పిల్లలకు పాఠాలు బోధించాల్సిన ఆమె కొద్ది రోజుల నుంచి ఆ పాఠశాల ప్రిన్సిపాల్ రాజేష్ పాల్‌తో సమావేశం పేరుతో గంటల తరబడి మాట్లాడుతూ ఉండేది. మీటింగ్‌లంటూ ఆయన గదిలో గంటల సేపు గడిపేది. దీంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సమయంలో కొందరు ఫోన్‌లో వీడియోలు తీశారు. అనూహ్య పరిణామానికి అవాక్కయిన ప్రిన్సిపాల్... వీడియోలు తొలగించేందుకు డబ్బులు ఆశ చూపాడు. దీనిపై గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు.. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)