ఉత్తరప్రదేశ్ లో దళిత విద్యార్థికి అవమానం !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లో రాయ్ బరేలీలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన  జరిగింది. స్థానిక దళిత వర్గానికి చెందిన ఓ మైనర్ బాలుడ్ని హింసకు గురిచేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  వీడియోలో ఆ దళిత బాలుడు చెవులు పట్టుకుని నేలపై కూర్చోపెట్టి అవమానించిన ఘటన చోటుచేసుకుంది. దాదాపుగా 2 నిమిషాల 30 సెక్లన్ల నిడివి కలిగిన ఈ వీడియో విపరీతంగా వైరల్ గా మారింది. ఈ వీడియో ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఏప్రిల్ 10న జరిగిందని.. బాధితుడు రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో పలువురు అగ్రవర్ణాలకు చెందిన వారిగా తెలిసింది. ఈ వీడియోలో ఉన్న బాధిత విద్యార్థి 10వ తరగతి చుదువుతున్నాడు. అతని తల్లి పొలం పని చేసుకుంటూ బతుకునీడుస్తుంది. ఓ అగ్రవర్ణ కులానికి చెందిన వ్యక్తి పొలంలో పని తాలూకూ డబ్బును అడిగేందుకు ఆ విద్యార్థి వెళ్లగా.. అతడిపై దుర్భాషలాడడం సహా అక్కడున్న వాళ్ల పాదాలను నాలుకతో నాకమని అవమానించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)