50 కేజీల నిమ్మకాయలు దొంగతనం

Telugu Lo Computer
0


రాజస్థాన్ లోని జైపూర్ ముహానా మండీలో వ్యాపారులు నిమ్మకాయలు కేజీ రూ.400 కు కేజీ లెక్కన అమ్ముతున్నారు. దీంతో దొంగలు నిమ్మకాయల గోదాం మీద కన్నేశారు. అర్ధరాత్రి సమయంలో దర్జాగా రిక్షాలో వచ్చి 50 కేజీల నిమ్మకాయలు కొట్టేశాడు. ఈ ఘటన సీసీటీవీలో నమోదైంది. దుకాణ యజమాని ఉదయం వచ్చి చూడగా.. నిమ్మకాయల బస్తాలు కనిపించలేదు. దీంతో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా దొంగతనం విషయం తెలిసింది. నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీ జరిగిన నిమ్మకాయల విలువ రూ. 20 వేలకు పైగానే ఉంటుందని దుకాణ యజమాని దీపక్ తెలిపాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)