13 సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Telugu Lo Computer
0


దేశంలో అడ్డు అదుపులేకుండా పెట్రోలియం సంస్థలు చమురు ధరలను పెంచేస్తూ ప్రజలపై మోయలేని భారం మోపుతున్నాయి. గత రెండు వారాలుగా పెట్రోల్ ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. గత 15 రోజుల్లో 13 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయంటే ప్రభుత్వాలు ప్రజలపై ఎంత భారం వేస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. మంగళవారం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్ పై 91 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెంచాయి పెట్రోలియం సంస్థలు. తాజా రేట్ల పెంపుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.104.61కి చేరుకోగా, డీజిల్ రూ. 95.87కి చేరుకుంది. మంగళవారం నాటికి హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.118.59గా ఉండగా, డీజిల్ రూ. 104.62కి చేరింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)