ఏపీఎస్ఆర్టీసీ లో సీనియర్ సిటిజన్ రాయితీ పునరుద్ధరణ

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో  కోవిడ్‌ కారణంగా ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులలో సీనియర్ సిటిజన్ లకు నిలిపివేసిన 25 శాతం రాయితీతో కూడిన ప్రయాణాన్ని ఏప్రిల్‌ 1 నుంచి పునరుద్ధరిస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. 60 ఏళ్లు దాటిన వారందరికీ ఈ రాయితీ వర్తిస్తుందన్నారు. రాష్ట్ర సచివాలయంలో మీడియా పాయింట్‌ వద్ద బుధవారం ఆయన మాట్లాడుతూ చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు ఆర్‌టిసిలో కారుణ్య నియామకాల ప్రక్రియను చేపడుతున్నామని, 1800 పైచిలుకు ఉద్యోగుల కుటుంబాలకు ఈ ఉద్యోగాలు లభిస్తాయన్నారు. సంబంధిత జిల్లాలోనే వారికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్టు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)