ఆంధ్రప్రదేశ్ లో సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన్కు లేఖ రాశారు. రాజధానిగా అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అమరావతినే రాజధానిగా కొనసాగిస్తున్నట్టు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించాలని సీఎంను సీపీఐ నేత రామకృష్ణ కోరారు. ఏపీ హైకోర్టు తీర్పును జగన్ సర్కారు గౌరవించాలని హితవు పలికారు. అమరావతి రాజధాని విషయంలో న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు మధ్య తగాదా పెట్టే విధంగా మంత్రులు వ్యాఖ్యలు చేయడం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సమగ్ర అభివృద్ధిపై శాసనసభలో చర్చించాలని ఆయన కోరారు. కాగా ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ చేసి తీరుతుందని.. మూడు రాజధానుల విషయంలో కట్టుబడి ఉందని ఇప్పటికే పలువురు మంత్రులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Post Top Ad
adg
Sunday, 6 March 2022
Home
Andhra Pradesh
అసెంబ్లీలో అమరావతిపై ప్రకటన చేయాలి : రామకృష్ణ
తీర్పును జగన్ సర్కారు గౌరవించాలని హితవు
న్యాయ వ్యవస్థకు
శాసన వ్యవస్థకు మధ్య తగాదా పెట్టే విధంగా మంత్రులు వ్యాఖ్యలు
అసెంబ్లీలో అమరావతిపై ప్రకటన చేయాలి : రామకృష్ణ
అసెంబ్లీలో అమరావతిపై ప్రకటన చేయాలి : రామకృష్ణ
Tags
# Andhra Pradesh
# అసెంబ్లీలో అమరావతిపై ప్రకటన చేయాలి : రామకృష్ణ
# తీర్పును జగన్ సర్కారు గౌరవించాలని హితవు
# న్యాయ వ్యవస్థకు
# శాసన వ్యవస్థకు మధ్య తగాదా పెట్టే విధంగా మంత్రులు వ్యాఖ్యలు
About Telugu Post
శాసన వ్యవస్థకు మధ్య తగాదా పెట్టే విధంగా మంత్రులు వ్యాఖ్యలు
Tags
Andhra Pradesh,
అసెంబ్లీలో అమరావతిపై ప్రకటన చేయాలి : రామకృష్ణ,
తీర్పును జగన్ సర్కారు గౌరవించాలని హితవు,
న్యాయ వ్యవస్థకు,
శాసన వ్యవస్థకు మధ్య తగాదా పెట్టే విధంగా మంత్రులు వ్యాఖ్యలు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment