దేశంలో గత వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు క్రమంగా కొనసాగుతోంది. ఈరోజు పెట్రోల్పై 34, డీజిల్పై 38 పైసలు చొప్పున పెరిగింది. గడిచిన వారం రోజుల్లో 6 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. గడిచిన ఏడు రోజుల్లో రూ.4.04, డీజిల్ పై రూ.4.13 వరకు పెరిగింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.71 పెరగగా.. డీజిల్ ధర రూ.99.08 వరకు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ లీటర్ పెట్రోల్ ధర రూ.99.41 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.90.77గా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
ఆరో రోజు కూడా పెంపు !
March 28, 2022
0