సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ చంద్ర లహోటి బుధవారం సాయంత్రం ఇక్కడి ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 81 సంవత్సరా లు. 2004 జూన్ 1న 35వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లహోటి బాధ్యతలు చేపట్టారు. 2005 నవంబర్ 1న పదవీ విరమణ చేశారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా బోర్డు ఆఫ్ డైరెక్టర్స్లో ఆయన మాజీ స్వతంత్ర డైరెక్టర్గా ఉన్నారు. టెలికాం దిగ్గజం వొడాఫోన్కు చెందిన రూ. 20,000 కోట్ల పన్నుల వివాదం కేసులో భారత ప్రభుత్వం తరఫున ఆరిట్రేటర్గా ఆయన వ్యవహరించారు.
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కన్నుమూత
March 25, 2022
0
Tags