హైదరాబాద్ లో నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా మరో ప్రమాదం జరిగింది. ట్యాంక్బండ్పై అర్ధరాత్రి విధులు నిర్వహిస్తున్న ముషీరాబాద్ సీఐ జహంగీర్ యాదవ్ ను వెనకనుండి కారు ఢీ కొట్టింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో సీఐకి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆయనను చికిత్స కోసం కేర్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం సీఐ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రమాదానికి కారణం అయిన కారు యజమాని అసిఫ్ ను గాంధీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 337 కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు. కారు యజమానిని ఆసిఫ్ నగర్కు చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు.. మద్యం మత్తులో నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో సీఐకి స్వల్ప గాయాలు ?
March 22, 2022
0