హర్యానాలోని కర్నాల్ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో రామ్ దేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా గురును మీడియా విలేకరి చమురు ధరలపై ప్రశ్నించారు. దాంతో రామ్ దేవ్ బాబా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అవును అయితే ఇప్పుడేం చేయమంటారు. ఈ ప్రశ్నలు అడగొద్దు. నేనేమీ మీ కాంట్రాక్టర్ కాదు. మీరు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదన్నారు. ఇదే అంశంపై సదరు విలేఖరి ప్రశ్నించగా.. రామ్ దేవ్ బాబా సీరియస్ అయ్యారు. నేనే ఆ మాట అన్నాను. నువ్వేం చేస్తావు, ముందు నోరు మూసుకో, మళ్లీ అడగొద్దు.. ఇలా మాట్లాడం అసలే మంచిది కాదు.. నువ్వు మీ తల్లిదండ్రులకు మంచి కొడుకుగా ఉండాలన్నారు. 2014లో బాబా రామ్ దేవ్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ.. లీటర్కు రూ. 40 పెట్రోల్, రూ. 300 లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అన్నారు. రామ్ దేవ్ బాబాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాబా రామ్ దేవ్ మాట్లాడుతూ కష్ట సమయాల్లో అందరూ కష్టపడి పనిచేయాలని ప్రజలను కోరారు. 'ఇంధన ధరలు తగ్గితే పన్ను రాదన్నారు. దేశాన్ని ఎలా పాలిస్తున్నారు.. జీతాలు చెల్లిస్తారని, రోడ్లు ఎలా వేస్తారని ప్రభుత్వం చెబుతోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణం తగ్గాలన్నారు. ఈ విషయంలో తాను ఏకీభవిస్తానని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలు కష్టపడి పనిచేయాలన్నారు. తాను కూడా తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి రాత్రి 10 గంటల వరకు పని చేస్తాను' అని అన్నారు.
విలేకరిపై బాబా రామ్ దేవ్ ఆగ్రహం
March 31, 2022
0
Tags