భర్త రెండో పెళ్లిని అడ్డుకున్నభార్య

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కోవెలకుంట్లకు చెందిన మహబూబ్‌బీకి ఆళ్ళగడ్డ మండలానికి చెందిన నాగరాజుకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల పాప ఉంది. వీరిద్దరి మధ్య కొంతకాలంగా వివాదం నేపథ్యంలో కోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో నాగరాజు మరో యువతిని వివాహం చేసుకున్నాడు. సోమవారం నగరంలోని ఎస్‌ఆర్‌ గ్రౌండ్‌ హోటల్‌లో పెళ్లి రిసెప్షన చేసుకుంటుండగా మహబూబ్‌ బీ తన కుటుంబసభ్యులతో కలిసి అక్కడికి చేరుకుంది. బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న దిశ పోలీసులు విచారించారు. తన మొదటి భార్యకు తలాక్‌ చెప్పిన తరువాతనే రెండో వివాహం చేసుకున్నానని నాగరాజు వాదిస్తున్నాడు. కానీ తలాక్‌కు తాను అంగీకరించలేదని మహబూబ్‌బీ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)