సత్య నాదెళ్ల కుమారుడు మృతి

Telugu Lo Computer
0


మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల కుమారుడు జైన్‌ నాదెళ్ల (26) మృతిచెందారు. పుట్టుకతోనే మస్తిష్క పక్షవాతం వ్యాధితో బాధపడుతున్న జైన్‌ అమెరికా కాలమానం ప్రకారం సోమవారం తీవ్ర అనారోగ్యానికి గురై మరణించారు. జైన్ మరణించినట్లు సాఫ్ట్‌వేర్ తయారీదారు తన ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి ఇమెయిల్‌లో తెలిపారు. కుటుంబాన్ని వారి ఆలోచనలు..ప్రార్థనలలో ఉంచాలని సందేశం ఎగ్జిక్యూటివ్‌లను కోరింది. 2014లో సీఈవో బాధ్యతలను సత్యా నాదెళ్ల స్వీకరించినప్పటి నుండి వైకల్యాలున్న వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు ఉత్పత్తుల రూపకల్పనపై కంపెనీని దృష్టి సారించారు. అలాగే కుమారుడు జైన్‌ అంటే ప్రాణం పెట్టే సత్యా కుమారిడిని పెంచే విషయంలో పలు శ్రద్ధలు తీసుకునేవారు. 2021లో జైన్ కు ఎక్కువగా చికిత్స చేసిన చిల్డ్రన్స్ హాస్పిటల్, సీటెల్ చిల్డ్రన్స్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ బ్రెయిన్ రీసెర్చ్‌లో భాగంగా పీడియాట్రిక్ న్యూరోసైన్సెస్‌లో జైన్ నాదెళ్లా ఎండోడ్ చైర్‌ను స్థాపించారు. “సంగీతంలో జైన్ అభిరుచి అతని ప్రకాశవంతమైన చిరునవ్వు, నాదెళ్ల కుటుంబానికి అతనిని ప్రేమించిన వారందరికీ అతను తెచ్చిన అపారమైన ఆనందం కోసం జైన్ గుర్తుండిపోతాడు” అని చిల్డ్రన్స్ హాస్పిటల్ యొక్క సీఈవో జెఫ్ స్పెరింగ్ తన బోర్డుకి ఒక సందేశంలో పేర్కొన్నారు. జైన్‌ నాదెళ్ల సెరిబ్రల్ పాల్సీతో జన్మించాడు. సెరిబ్రల్ పాల్సీ అంటే.. పుట్టుకతోనే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి. ఈ వ్యాధి వల్ల మెదడుకు కాళ్లు, చేతులు పట్టు తప్పిపోతాయి. ఏమాత్రం కంట్రోల్ ఉండదు. నడవలేని స్థితిలో ఉండటం కారణంగా వీల్‌చైర్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. జైన్ నాదెళ్ల పరిస్థితి కూడా అలాగే ఉండేది. సత్యా నాదెళ్లకు జైన్ తో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)