భారత నౌకాదళం అధునాతన వెర్షన్ బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఈ పరీక్ష సమయంలో క్షిపణి ఖచ్చితమైన లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయవంతమైన పరీక్ష స్వావలంబన భారత మిషన్ విజయానికి ఒక మైలురాయిగా పరిగణించబడుతుంది. సముద్రం నుంచి దూరంగా భూమిపై ఉన్న లక్ష్యాలపై దాడి చేసే సామర్థ్యాన్ని ఈ పరీక్షల ద్వారా తెలుసుకున్నట్లు నౌకాదళం వర్గాలు తెలిపాయి. బ్రహ్మోస్ క్షిపణితోపాటు దీనిని పరీక్షించిన ఐఎన్ఎస్ చెన్నై యుద్ధ నౌక, రెండూ కూడా దేశీయంగా నిర్మించినవేనని భారత నౌకాదళం తెలిపింది. భారతీయ క్షిపణి అభివృద్ధి, నౌకా నిర్మాణ సామర్థ్యానికి ఇవి ప్రతీకలని చెప్పింది.ఆత్మ నిర్భర్ భారత్,మేక్ ఇన్ ఇండియా ప్రయత్నాలు, సహకారాలను ఇలాంటివి మరింత బలోపేతం చేస్తాయని చెప్పింది.
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
March 05, 2022
0
Tags