ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి చేసే ఒఎన్జిసిని విక్రయించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒఎన్జిసిలోని 1.5 శాతం వాటాలు విక్రయించి.. తద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించనుంది. ఒఎన్జిసిలో ప్రభుత్వానికి 60.41 శాతం వాటాలు ఉన్నాయి. ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్ఎస్) విధానంలో షేర్ల విక్రయం ఉండనున్నట్లు తెలిపింది. మార్చి 30, 31 తారీఖుల్లో ఒఎఫ్ఎస్ నిర్వహించనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలియజేసింది. ఆఫర్ ఫర్ సేల్ కోసం ఫ్లోర్ ధరను షేరు ఒక్కింటికి రూ. 159 గా నిర్ణయించింది. మంగళవారం బిఎస్ఇలో స్టాక్ ముగింపు ధర రూ. 171.05తో పోలిస్తే ఇది 7 శాతం డిస్కౌంటు. ఒఎఫ్ఎస్ కింద కనీసం 25 శాతం షేర్లను మ్యూచువల్ ఫండ్స్.. బీమా కంపెనీలకు, 10 శాతం షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నారు. ఒఎన్జిసి ఉద్యోగులకు కూడా షేర్లను కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించింది. ఉద్యోగులు ఒక్కొక్కరు 5 లక్షల విలువ చేసే షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒఎఫ్ఎస్ కింద విక్రయిస్తున్న 0.075 శాతం షేర్లను అర్హులైన ఉద్యోగులకు కటాఫ్ ధరకు కేటాయించనున్నట్లు కంపెనీ వివరించింది.
Post Top Ad
adg
Tuesday, 29 March 2022
Home
business
National
అర్హులైన ఉద్యోగులకు కటాఫ్ ధరకు
ఒఎన్జిసి అమ్మకానికి కేంద్రం ఓకే !
షేరు ఒక్కింటికి రూ. 159
ఒఎన్జిసి అమ్మకానికి కేంద్రం ఓకే !
ఒఎన్జిసి అమ్మకానికి కేంద్రం ఓకే !
Tags
# business
# National
# అర్హులైన ఉద్యోగులకు కటాఫ్ ధరకు
# ఒఎన్జిసి అమ్మకానికి కేంద్రం ఓకే !
# షేరు ఒక్కింటికి రూ. 159
About Telugu Post
షేరు ఒక్కింటికి రూ. 159
Tags
business,
National,
అర్హులైన ఉద్యోగులకు కటాఫ్ ధరకు,
ఒఎన్జిసి అమ్మకానికి కేంద్రం ఓకే !,
షేరు ఒక్కింటికి రూ. 159
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment